Pages

Tuesday, February 14, 2012

సహజ నటనా శిరోమణి

సహజ నటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ఆమె గొప్ప నటి అని, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యము. అన్నపూర్ణ వారి మొదటి చిత్రం "దొంగరాముడు" లో అక్కినేని సరసన కథా నాయికగా నటించిన విషయం అందరికి తెలిసిందే కదా.  ఆ చిత్రంలో, ఆమెది కూరగాయలు అమ్మేసీత పాత్ర.  తల మీద గంప పెట్టుకొని, కూరలు అమ్మే సీన్ షూటింగ్ జరుగుతోందట. ఖాలీ గంపను, తల మీద పెట్టుకొని నటించమంటే, ఆమె ఒప్పుకోలేదట. గంప లో కూరగాయలు ఉంటెనే, నటించడానికి సహజత్వం వస్తుందని చెప్పి, కూరగాయలు తెప్పించి, గంపలో పెట్టుకొని, పాత్రలో జీవిన్చిందని, విన్నాను. సహజత్వానికి విలువ నిచ్చేనటనా శిరోమణి ఆమె. ఈ చిత్రంలో సావిత్రి మీద చిత్రీకరించిన పాట "అందచందాల సొగసరి వాడు, విందు బోంచేయ వస్తాడు నేడు," వినండి, వీడియో క్లిప్పింగ్ చూడండి, ఆనందించండి. గీత రచన: సముద్రాల, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు. చిత్రం విడుదల:01-10-1955. చిత్ర దర్శకుడు: కదిరి వెంకట్ రెడ్డి గారు.
 
 

No comments:

Post a Comment